బిజినెస్

పతంజలి సేవలను విస్తరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జనవరి 29: పతంజలి గ్రూప్ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలని చూస్తున్నట్లు సంస్థ అధిపతి, యోగా గురువు రామ్‌దేవ్ బాబా వెల్లడించారు. ఆదివారం మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు చిత్తూరు జిల్లా యోగా గురువులు, బిజెపి నాయకులు, డిఎస్పీ నంజుండప్ప ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన రాజగోపురానికి చెందిన పూజల్లో పాల్గొంటున్నానని చెప్పారు. రాత్రి కృష్ణపట్నం పోర్టులో బసచేసి, ఉదయం కృష్ణపట్నం పోర్టును పరిశీలిస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఎక్కువగా అభిమానిస్తారని, అందువల్ల తమ పతంజలి సంస్థ సేవల్లోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించిన ఆయుర్వేద మందులు, పాడి పరిశ్రమలోని గోవుపై ప్రయోగాలు, విద్య, యోగ శిక్షణలు ఏవేవి రాష్ట్రానికి కావాలో వాటిని పరిశీలించి రాష్టవ్య్రాప్తంగా సేవలను విస్తరింపచేస్తామని ఆయన తెలిపారు. దీంతో భారీగా పెట్టుబడు లతోపాటు అంతేస్థాయలో ఉద్యోగా వకాశాలూ వస్తాయన్న అంచనాలు కనిపిస్తున్నాయ.