బిజినెస్

భారతీయ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబ డుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడు లను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పిఐలు.. ఈ నెలలో మాత్రం తీరు మార్చు కున్నారు. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలో 9,359 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్లలోకి మరో 5,279 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్లలోకి ఫిబ్రవరి 1-23 మధ్య వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 14,638 కోట్ల రూపాయలకు చేరింది. నిజానికి నిరుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్లకు మాత్రం దూరంగా ఉండిపోయారు. అయతే జనవరిలో రుణ మార్కెట్లతోపాటు స్టాక్ మార్కెట్లలోనూ పెట్టుబడులకు నిరాస క్తిని ప్రదర్శించారు. దీంతో మార్కెట్ వర్గాలు ఉలిక్కిపడగా, ఈ నెలలో తిరిగి పెట్టుబడులపట్ల ఎఫ్‌పిఐలు మొగ్గుచూపడం.. మార్కెట్లలో కొత్త ఆశలను చిగురింపజేశాయ. 2016లో భారతీయ మార్కెట్ల నుంచి 3.2 బిలియన్ డాలర్ల (23,079 కోట్ల రూపాయలు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేవలం నవంబర్‌లోనే సుమారు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న మదుపరులు.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు మధ్య డిసెంబర్‌లో దాదాపు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను లాగేసుకున్నారు. అక్టోబర్‌లోనూ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడు లను గుంజేశారు. దీంతో నిరుడు చివరి మూడు నెలల్లో భారతీయ మార్కెట్ల నుంచి తరలిపోయన ఎఫ్‌పిఐ పెట్టుబడుల విలువ 12 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గత నెల జనవరితో కలుపుకుని మొత్తం అటు స్టాక్, ఇటు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పెట్టుబ డుల విలువ 80,310 కోట్ల రూపా యలకు చేరింది. ఫలితంగా అంతకు ముందు దేశీయ మార్కెట్ల లోకి వచ్చిన పెట్టుబడుల కంటే పోయన పెట్టుబడులే అధికమైన ట్లైంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామా ల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. అయతే అంతకుముందు మూడు నెలల్లో (జూలై-సెప్టెంబర్) విదేశీ మదుప రులు భారతీయ మార్కెట్ల లోకి 46,000 కోట్ల రూపాయల పెట్టుబ డులను తెచ్చారు. కాగా, 2016 జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. మరోవైపు 2016 సంవత్సరం మొత్తంగా స్టాక్ మార్కెట్ల లోకి 20,566 కోట్ల రూపా యల పెట్టుబడులను పట్టుకొచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్ల నుంచి 43,645 కోట్ల రూపాయల పెట్టుబడు లను వెనక్కి తీసుకున్నారు. దీంతో భారతీయ మార్కెట్ల నుంచి 2016లో 23,079 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెళ్లిపోయనట్లైంది.