బిజినెస్
కృష్ణపట్నం పోర్టు డిప్యూటీ కమిషనర్కు డబ్ల్యూసిఒ సర్ట్ఫికెట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 February 2017
విజయవాడ, ఫిబ్రవరి 27: కృష్ణపట్నం పోర్టు డిప్యూటి కమిషనర్ ముసులూరు శ్రీకాంత్కు ప్రతిష్టాత్మకమైన ‘వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్’ (డబ్ల్యూసిఒ) సర్ట్ఫికెట్ లభించింది. ఈ సందర్భంగా విజయవాడలోని ఏపి కస్టమ్స్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపి కస్టమ్స్ కమిషనర్ ఎస్కె రెహమాన్.. డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ను అభినందించారు. ఐఆర్ఎస్ అధికారి శ్రీకాంత్ ప్రస్తుతం విజయవాడ కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆయన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్కుమార్ గంగ్వార్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో డబ్ల్యూసిఒ సర్టిఫికెట్ తీసుకున్నారు.