బిజినెస్
కోల్ ఇండియా రెండో విడత మధ్యంతర డివిడెండ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 March 2017
న్యూఢిల్లీ, మార్చి 26: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్).. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రెండో విడత మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. 10 రూపాయల ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్కు 1.15 రూపాయల చొప్పున డివిడెండ్ను ఇచ్చింది. ఆదివారం సమావేశమైన సంస్థ బోర్డు దీనికి అంగీకారం తెలిపింది. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతానికిపైగా వాటా కోల్ ఇండియాదే. ఈ ఆర్థిక సంవత్సరం 598 మిలియన్ టన్నుల ఉత్పత్తిపై సంస్థ కనే్నసింది. 2020 నాటికి 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కోల్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.