బిజినెస్

తిరుపతికి ఎయిరిండియా కొత్త సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఏప్రిల్ 1: గన్నవరం-తిరుపతి మధ్య ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నూతన సర్వీసును శనివారం ప్రారంభించింది. వారంలో ఆరు రోజులు ఉదయం 7.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరి తిరుపతికి వెళుతుందని ఎయిరిండియా స్టేషన్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తొలి బోర్డింగ్ పాస్‌ను ఆయన అందజేయగా, విమానానికి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి మధుసూధనరావు జెండా ఊపి ప్రారంభించారు. విశాఖపట్నం నుండి ఉదయం 7.30 గంటలకు గన్నవరం చేరుకుని, 7.55 గంటలకు బయలుదేరి తిరుపతికి వెళుతుందన్నారు. తిరిగి ఉదయం 10.30 గంటలకు గన్నవరం వచ్చి, 10.55 గంటలకు విశాఖపట్నం వెళుతుందన్నారు. అక్టోబర్ 28వ తేదీ వరకు బుధవారం మినహా ప్రతి రోజు విశాఖపట్నం, గన్నవరం, తిరుపతిలకు ఎయిరిండియా విమానం రాకపోకలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు. తొలిరోజు విశాఖపట్నం నుండి 25, గన్నవరం నుండి ఏడుగురుతో మొత్తం 32 మంది ప్రయాణికులతో తిరుపతికి వెళ్లినట్లు ఆయన చెప్పారు. విమానంలో మొత్తం 72 సీట్లు ఉన్నాయ.
జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం
రేణిగుంట: రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా అధికారులు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి విమాన సర్వీసులను ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు విమానం విమానాశ్రయానికి చేరుకుంది. తిరిగి 10 గంటలకు విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్లింది.

చిత్రం..గన్నవరం ఎయిర్‌పోర్టులో జెండా ఊపి విమానాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం