బిజినెస్

మీట నొక్కితే రూ.15 లక్షల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు తమ ఎటిఎంల ద్వారా ఖాతాదారులకు రూ.15 లక్షల వరకు వ్యక్తిగ రుణాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో రుణం కోసం ఎటువంటి దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ ముందుగా ఎంపిక చేసిన కొంత మంది ఖాతాదారులు (వేతనాలు పొందేవారు) ఈ వ్యక్తిగత రుణాలను పొందవచ్చని ఆ బ్యాంకు స్పష్టం చేసింది. రుణ సమాచార సంస్థల (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల) నుంచి పొందిన సమాచారాన్ని ఆసరాగా చేసుకుని ఎంపిక చేసిన కొంత మంది ఖాదారులకు ఐసిఐసిఐ బ్యాంకు ముందుగానే ఈ వ్యక్తిగత రుణాలను పొందే అర్హత కల్పిస్తుంది. ఇటువంటి ఖాతాదారులు ఎటిఎంలో లావాదేవీ పూర్తి చేసిన వెంటనే వ్యక్తిగత రుణాలను పొందేందుకు వారు అర్హులన్న విషయాన్ని తెలియజేస్తూ ఎటిఎం తెరపై ఒక సందేశం దర్శనమిస్తుంది. ఖాతాదారులు గనుక దీనిని ఎంచుకున్నట్లయితే ఐదేళ్లలో తిరిగి చెల్లించే విధంగా 15 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చని, ఈ రుణం కింద ఖాతాదారులు పొందదల్చుకున్న మొత్తం సొమ్మును వెంటనే వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, ఈ సేవను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చామని ఐసిఐసిఐ బ్యాంకు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.