బిజినెస్

డీమానిటైజేషన్, జిఎస్‌టికి ప్రజల మద్దతు అమోఘం: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ‘డీమానిటైజేషన్, జిఎస్‌టి వంటి చారిత్రక నిర్ణయాలకు ప్రజల నుంచి మునుపెన్నడూ లేనివిధంగా మద్దతును అందుకున్నాం.’ అని సోమవారం రాజస్థాన్‌కు చెందిన ఓ ఎంపీల బృందంతో మోదీ అన్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినది తెలిసిందే.