బిజినెస్
అప్రమత్తంగా ఉండాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, జూలై 29: మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న జియో ఫోన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెలికాం రంగంలో ఫీచర్ ఫోన్ హ్యాండ్ సెట్లకు కొత్త ఊపిరినిచ్చే జియో ఫోన్ కోసం ఆగస్టు 24 నుంచి ఫ్రీ బుకింగ్లు ప్రారంభం కానున్నాయి. జియో ఫోన్ బుకింగ్ను వినియోగదారులు మై జియో ఆప్ ద్వారాగాని, ఆన్లైన్తోగాని, రిలయన్స్ జియో రిటైల్ స్టోర్ల ద్వారాగాని చేసుకోవచ్చని జియో సంస్థ తెలిపింది. నిర్దేశించిన 1,500 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి బుకింగ్ చేసుకుంటే కస్టమర్లకు సెప్టెంబర్ నుంచి జియో ఫోన్ అందుబాటులోకి వస్తుంది. జియో ఫోన్పై మరిన్ని వివరాలు తాజా అప్డేట్స్ కోసం జియోడాట్కామ్ వెబ్సైట్ను సందర్శించాలని ఆ కంపెనీ పేర్కొంది. కాగా, జియో ఫోన్పై మార్కెట్లో ఉన్న అపరిమితమైన ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అనధికారిక వెబ్సైట్లు, రిటైల్ సంస్థలు అడ్వాన్స్ బుకింగ్ల పేరిట పాల్పడే మోసాలపట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది.