బిజినెస్

పార్శ్వనాథ్, మరో ఐదు సంస్థలకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 11: అనుమానిత షెల్ కంపెనీలపై నిషేధం వ్యవహారంలో ఆరు సంస్థలకు సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్) ఊరటనిచ్చింది. అనుమానిత 331 డొల్ల సంస్థల షేర్ల ట్రేడింగ్‌పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిషేధం విధించగా, పార్శ్వనాథ్ డెవలపర్స్, మరో ఐదు సంస్థలు శాట్‌ను ఆశ్రయించాయి. దీంతో శుక్రవారం ఈ సంస్థల షేర్లపై ఉన్న సెబీ నిషేధాజ్ఞలను శాట్ ఎత్తివేసింది. అయితే ఈ సంస్థలపై విచారణ జరపవచ్చని స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఆరు సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇ తెలిపాయ.