బిజినెస్

కరూర్ వైశ్యా బ్యాంక్‌లో ఆధార్ నమోదు, అప్‌గ్రేడ్ సౌకర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఆధార్ నమోదు, అప్‌గ్రేడ్ చేసే సదుపాయాన్ని ప్రారంభించిన దేశీయ తొలి ప్రైవేట్ రంగ బ్యాంక్ కరూర్ వైశ్యా బ్యాంక్. చెన్నైలోని నెల్సన్ మాణిక్యం రోడ్ బ్రాంచ్‌లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించి ఈ ఘనతను సాధించింది. ఆధార్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ శాఖల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఆధార్ నమోదు, అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించాలని సూచించింది. దీనికి కరూర్ వైశ్యా తొలుత స్పందించింది. కాగా, త్వరలో దేశ వ్యాప్తంగా 75 బ్రాంచీల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నామని కరూర్ వైశ్యా బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.