బిజినెస్
సంస్కరణల అమలు కీలకం: నీతి ఆయోగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 August 2017
న్యూఢిల్లీ, ఆగస్టు 29: అత్యుత్తమ, పారదర్శక సంస్కరణలతోనే దేశంలో పేదరికాన్ని పారద్రోలగలమని, వ్యాపారానికి అనువైన పరిస్థితులను నెలకొల్పగలమని, కోట్లాది మంది జీవన ప్రమాణాలను పెంచగలమని నీతి ఆయోగ్ పేర్కొంది. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: యాన్ ఎంటర్ప్రైజ్ సర్వే ఆఫ్ ఇండియన్ స్టేట్స్’ పేరిట ఐడిఎఫ్సితో కలిసి నీతి ఆయోగ్ ఓ నివేదికను రూపొందించింది. దీన్ని కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్ ఇక్కడ విడుదల చేశారు. హుషారుతో కూడిన సంస్కరణలెన్నో భారత్కు ఇంకా అవసరమని ఈ నివేదికలో నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.