బిజినెస్
మహీంద్ర కొత్త బ్రాండ్.. ట్రాక్స్టార్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 30 August 2017
న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర.. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి నిర్వహిస్తున్న తమ జాయింట్ వెంచర్ పేరును మార్చేసింది. మహీంద్ర గుజరాత్ ట్రాక్టర్స్ను గ్రోమాక్స్ అగ్రి ఎక్విప్మెంట్ లిమిటెడ్గా మార్చుతున్నట్లు ప్రకటించింది. అలాగే ట్రాక్స్టార్ అనే ఓ నూతన ట్రాక్టర్ బ్రాండ్నూ పరిచయం చేసింది. గ్రోమాక్స్ అగ్రి ఎక్విప్మెంట్ లిమిటెడ్ క్రింద 30-50 హెచ్పి సామర్థ్యంలో ఈ ట్రాక్స్టార్ బ్రాండ్ ట్రాక్టర్లను తయారు చేస్తామని మహీంద్ర ఈ సందర్భంగా తెలియజేసింది. రైతులకు తక్కువ ధరకే వ్యవసాయ ఉత్పాదనలను అందిస్తామని పేర్కొంది.