బిజినెస్

నష్టపోయింది 12,717 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మోసగించడంతో తాను నష్టపోయిన సొమ్ము సుమారు రెండు బిలియన్ డాలర్లు ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) మంగళవారం ప్రకటించింది. అక్రమ లావాదేవీల వల్ల తాను నష్టపోయిన మొత్తం గతంలో అంచనా వేసిన దానికన్నా 204 మిలియన్ డాలర్లు పెరిగిందని పీఎన్‌బీ స్టాక్ ఎక్స్చేంజ్‌కి సమర్పించిన పత్రంలో వెల్లడించింది. మోసపోయిన సొమ్ము రూ. 11,394.02 కోట్లు ఉంటుందని పీఎన్‌బీ గతంలో ప్రకటించింది. అయితే, గతంలో గుర్తించని, రూ. 1,323 కోట్ల మేరకు మోసపోయినట్లు తాజాగా వెల్లడయింది. దీంతో అక్రమ లావాదేవీల్లో నష్టపోయిన సొమ్ము మొత్తం రూ. 12,717 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ మోసం వల్ల నష్టపోయిన ఇతర రుణదాతలకు పరిహారం చెల్లించడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఆదేశాలు అందలేదని కూడా పీఎన్‌బీ తెలిపింది.