బిజినెస్

తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెరిగిన ధరల పట్టిక ప్రకారం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 76.47కు, ముంబయిలో రూ. 83.91కి చేరింది. అలాగే కోల్‌కతాలో రూ. 79.27కు, చెన్నైలో రూ. 79.43కు చేరింది. లీటర్ డీజిల్ ధర ఢిల్లీలో రూ. 68.08కి, ముంబయిలో రూ. 72.28కి, కోల్‌కతాలో రూ. 70.71కి, చెన్నైలో రూ. 71.90కి చేరిందని ఐఓసీ తెలిపింది. పెరిగిన ధరలు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి అమలులోకి వచ్చాయి.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలయిన ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ఉదయం 6 గంటల నుంచి వర్తించే విధంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.