బిజినెస్
ఏడు కంపెనీలపై రూ.37 లక్షల జరిమానా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 July 2018
న్యూఢిల్లీ, జూలై 27: ఓరేగాన్ కమర్షియల్లో షేర్ హోల్డింగ్ల మార్పులను వెల్లడించనందుకు ఏడు కంపెనీలకు రూ. 37 లక్షల జరిమానాను విధిస్తూ సెబి సంస్థ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి విచారించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబి తెలిపింది. ఇటీవల ఓరేగాన్ కంపెనీ సాయి ఆనంద్ కమర్షియల్గా పేరు మారిందని సెబి తెలిపింది. ఈ కంపెనీకి చెందిన షేర్లను వివిధ సందర్భాల్లో విక్రయించినట్లు సెబి పేర్కొంది. సెబికి సంబంధించి ఇన్సైడ్ ట్రేడింగ్ నిషేధం, రెగ్యులేషన్స్ అండ్ ఎస్ఏఎస్టీ నిబంధనల కింద వాటాలను విక్రయించే విషయమై కంపెనీకి తెలియచేయాలని సెబి తెలిపింది.