బిజినెస్

దిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ధరల పట్టిక ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.16కు, ముంబయిలో రూ. 83.61కు తగ్గింది. అలాగే కోల్‌కతాలో రూ. 79.05కు, చెన్నైలో రూ. 79.11కు చేరింది. డీజిల్ ధర ఢిల్లీలో లీటర్‌కు రూ. 67.62కు తగ్గింది. అలాగే ముంబయిలో రూ. 71.79కి, కోల్‌కతాలో రూ. 70.37కు, చెన్నైలో రూ. 71.41కి చేరినట్లు దేశంలో అతి పెద్ద చమురు మార్కెటింగ్ సంస్థ అయిన ఐఓసీ తెలిపింది. ఇదిలా ఉండగా, శుక్రవారం ఈ నాలుగు నగరాలలో పెట్రోల్ ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే డీజిల్ ధరలు మాత్రం తగ్గాయి. తాజాగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం ఉదయం ఆరు గంటలకు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలయిన ఐఓసీ, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి అమలు అయ్యేలా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షించి, సవరించేందుకు ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు నిరుడు జూన్‌లో అనుమతించింది.