బిజినెస్

స్వల్పంగా పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశంలో రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. పది పెరిగి, రూ. 31,420కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తక్కువగానే ఉన్నప్పటికీ, దేశంలో స్థానిక నగల వ్యాపారుల నుంచి విస్తృతంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో దాని ధర పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం అమ్మకాల ఒత్తిడి వల్ల తగ్గిపోయింది. శనివారం కిలో వెండి ధర మరో రూ. 150 తగ్గి, రూ. 37,500 వద్ద ట్రేడ్ అయింది. దేశంలో స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరగడం వల్ల బంగారం ధర పెరిగిందని, అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన ధోరణి నెలకొనడం వల్ల ధర ఎక్కువగా పెరగలేదని వ్యాపారులు చెప్పారు. విదేశీ మార్కెట్లను పరిశీలిస్తే, న్యూయార్క్‌లో పసిడి ధర శుక్రవారం 0.65 శాతం తగ్గి, ఒక ఔన్స్‌కు 1,193 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.78 శాతం తగ్గి, ఒక ఔన్స్‌కు 14.03 డాలర్లకు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ. 20 పెరిగి, రూ. 31,420కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర కూడా రూ. 20 పెరిగి, రూ. 31,270కి చేరుకుంది. గత రెండు రోజుల్లో కలిసి పది గ్రాముల బంగారం ధర రూ. 225 తగ్గింది. అయితే సావరిన్ గోల్డ్ ధరలో ఎలాంటి మార్పు లేదు. శనివారం కూడా ఎనిమిది గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ. 24,500 వద్ద కొనసాగింది.