బిజినెస్
‘డిఫాల్టర్ల పేర్లను ప్రకటిస్తాం’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 July 2016
అహ్మదాబాద్, జూలై 16: బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలకు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పిఎ) కారకులైనవారి పేర్లను బహీర్గతం చేస్తామని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) హెచ్చరించింది. మొండి బకాయిదారుల్లో తొలి 7,000 మంది పేర్లను ప్రకటిస్తామని శనివారం వెల్లడించింది. ఈ 7,000 మంది మొండి బకాయిల విలువ దాదాపు 70,000 కోట్ల రూపాయలుగా ఉందని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ నెల 29న బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నట్లూ చెప్పారు.