బిజినెస్

‘షేర్ అమ్మకాల ఆఫర్ల’తో ముందుకురానున్న ఆరు ప్రభుత్వ అనుబంధ కంపెనీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో నడుస్తున్న ఆరు అనుబంధ సంస్ధలు త్వరలో ‘షేర్ల అమ్మకాల ఆఫర్ల’తో ముందుకు రానున్నాయి. టీహెచ్‌డీసీఐఎల్, టీసీఐఎల్, రైల్ టెల్ సహా ఇరు ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలు ఈ ఆఫర్లు చేయనున్నాయని, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ కంపెనీ (కేఐఓసీఐఎల్) మాత్రం ‘్ఫలోఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎప్‌ఓపీ)తో ముందుకొస్తుందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. స్టాక్ ఎక్చేంజీల్లోని సీపీఎస్‌ఈలల్లో ఏడు కంపెనీలను ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓలు) జాబితాలోకి చేరుస్తూ ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోద ముద్ర వేసింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం ఇక్కడ విలేఖరులకు వెల్లడించారు. కాగా గురువారం సమావేశమైన సీసీఈఏ మొత్తం ఆరు ప్రభుత్వ రంగ అండర్ టేకింగ్ కంపెనీలు (పీఎస్‌యూ)లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లకు, ఒక కంపెనీ ఎఫ్‌పీఓకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ జాబితాలోకి చేర్చిందన్నారు. ఈ మేరకు టెలీ కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ (ఇండియా) లిమిటెడ్ (టీసీఐఎల్), రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్), వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (డబ్ల్యుఏపీసీఓఎస్), ఎప్‌సీఐ అరవాలి జిప్సమ్ అండ్ మినల్స్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌ఏజీఎంఐఎల్)లు ఐపీఓలతో ముందుకు రానున్నాయి. కేఐఓసీఎల్ మాత్రం ఎప్‌పీఓతో ముందకు వస్తుంది. ఇలా కంపెనీలను ఐపీఓ ఎఫ్‌పీఓ జాబితాలో చేర్చడం వల్ల అవి ఆర్థికంగా బలపడేందుకు వీలవుందని మంత్రి ప్రసాద్ వివరించారు.