బిజినెస్

భారత్‌కు వచ్చిన సౌదీ చమురు మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్‌ఫలీ మరోసారి భారత్ వచ్చారు. మూడు వారాల్లో ఆయన రావడం ఇది రెండోసారి. భారతీయుల్లో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతుల కుమారుడైన ఆకాశ్ అంబానీ వివాహానికి ఆయన హాజరయ్యారు. భారత చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఆయన కొంత సేపు చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు. గత ఏడాది డిసెంబర్ మాసంలో, ఉదయ్‌పూర్‌లో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహానికి ముందు జరిగిన విందుకు ఆయన హాజరయ్యారు. ప్రముఖ వజ్రాల తయారీదారుడు రసెల్ మెహతా, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకతో ఆకాశ్ అంబానీ వివాహం శనివారం, ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన జియో వరల్డ్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సుమారు దశాబ్ద కాలంగా అంబానీలతో అల్‌ఫలీకి సన్నిహిత సంబంధం ఉంది.