బిజినెస్

మొబైల్ యాప్ కాల్స్‌పై ఆర్‌కామ్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. బుధవారం తమ 3జి, 4జి వినియోగదారుల కోసం ఓ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. ‘కాలింగ్ కా నయా తరీకా’ అనే పేరుతో పరిచయమైన ఈ పథకంతో మొబైల్ అప్లికేషన్స్ (యాప్) నుంచి చేసే కాల్స్ 95 శాతం చౌక అవుతాయని సంస్థ తెలియజేసింది. 200 మెగాబైట్ 4జి డేటా ధర 39 రూపాయలని వెల్లడించింది. ఈ ప్యాకేజీతో వాట్సాప్, స్కైప్, గూగుల్ హ్యాంగౌట్స్, ఎఫ్‌బి మెసెంజర్, జియోచాట్ తదితర మొబైల్ యాప్స్ ద్వారా 300 నిమిషాల ఫోన్ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ కన్జ్యూమర్ బిజినెస్ సిఇఒ గుర్దీప్ సింగ్ తెలిపారు.