బిజినెస్

త్వరలో ఆరు విమానాశ్రయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: పారిశ్రామికంగా బలమైన రాష్ట్రంగా అవతరిస్తున్న తెలంగాణలో కొత్తగా ఆరు విమానాశ్రయాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఈ దిశగా విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికను ఇచ్చే బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి అప్పగించనున్నారు. విమానాశ్రయాల ఏర్పాటుకు కచ్చితమైన సాంకేతిక నివేదిక ఉండాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆరు విమానాశ్రయాల్లో సాంకేతికపరమైన అంశాలను అధ్యయనం చేసేందుకు దాదాపు రూ.4.5 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఈ కనె్సల్టెన్సీకి ఏఏఐ సహకారాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా నిధులు కూడా సర్కారు ఇవ్వనుంది. ఈ నివేదిక వచ్చిన వెంటనే అత్యవసరంగా విమానాశ్రయాల ఏర్పాటును ప్రాధాన్యతల ప్రకారం వేగవంతం చేస్తారు. ఇప్పటికే వౌలిక
సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ముందుగా రూ.1.06 కోట్ల నిధులనున మంజూరు చేసింది. వరంగల్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లో విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవసరాన్ని బట్టి ఎయిర్‌స్ట్రిప్ట్స్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను నిర్మిస్తారు. వరంగల్ వద్ద మమ్నూరు, పెద్దపల్లి వద్ద బసంతనగర్, నిజామాబాద్ వద్ద జక్రాన్‌ప8ల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం , మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల వద్ద విమానాశ్రయాలను నెలకొల్పాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కాగా వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతికపరమైన అవరోధాలు ఉన్నాయి. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ జీఎంఆర్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు లేదు. దీనికి నిబంధనలు అంగీకరించవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో ఆ మేరకు జీఎంఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పెద్దపల్లి వద్ద బసంత్‌నగర్‌లో 750 ఎకరాల స్థలాన్ని విమానాశ్రయం ఏర్పాటు నిమిత్తం సేకరించనున్నారు. నిజామాబాద్ వద్ద 850 ఎకరాల స్థలం, ఆదిలాబాద్ వద్ద 350 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. రాష్ట్రంలో ఐటీ రంగంలో ఎగుమతులు రూ.1.09 లక్షల కోట్లు దాటడంతో వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ రంగం విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఐటీ రంగం హైదరాబాద్‌కే కాకుండా ప్రధానమైన పట్టణాల్లో కూడా విస్తరించేందుకు కేసీఆర్ సర్కార్ ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. రామగుండం థర్మల్ విద్యుత్ కర్మాగారం, బొగ్గు గనుల కార్యకలాపాలు, కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్‌ను దృష్టిలో పెట్టుకుని పెద్దపల్లి, కొత్తగూడెంలో ముందుగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.