బిజినెస్

కెసిపిలో రెండో ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట రూరల్, ఆగస్టు 28: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాల సమీపంలోని కెసిపి సిమెంట్స్ కర్మాగారంలో రెండో ప్లాంట్ నిర్మాణానికి ఆ సంస్థ జెఎండి వెలగపూడి ఇందిరాదత్తు ఆదివారం భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రస్తుత వార్షిక సామర్థ్యం 1.86 మిలియన్ టన్నులని, దాన్ని రూ. 400 కోట్ల వ్యయంతో రెట్టింపు చేస్తున్నామన్నారు. 2017 డిసెంబర్ నాటికి ఈ ప్లాంట్‌ను పూర్తిచేస్తామని, మరో రూ. 50 కోట్ల ఖర్చుతో రైల్వే లైన్‌నూ పూర్తిచేసి దూరప్రాంతాలకు సిమెంట్ రవాణా చేస్తామని చెప్పారు. కాగా, ముక్త్యాల రాజావారి వర్ధంతిని ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.

చిత్రం.. భూమిపూజ చేస్తున్న సంస్థ జెఎండి