బిజినెస్

పరిశ్రమలకు సత్వర అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 3: పరిశ్రమలకు అవసరమైన అనుమతులు, రాయితీలు, ప్రోత్సాహకాలపై పారిశ్రామిక వేత్తలతో చర్చించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో పరిశ్రమలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. విజయవాడ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (వీసీఐసీ), బెంగుళూరు- చెన్నై కారిడార్ (బీసీఐసీ) పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. అన్ని నియోజకవర్గాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)ల స్థాపనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా పారిశ్రామిక అభివృద్ధి జరగాలని అభిలషించారు.

చిత్రం... పరిశ్రమల శాఖపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి