బిజినెస్
ఎస్బీఐ అమరావతి సర్కిల్ స్వచ్ఛతా సేవ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విభాగం సిబ్బంది బుధవారం ఇక్కడ నెక్లెస్ రోడ్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ హిత సంచులను పంపిణీ చేశారు. ప్రజల నుంచి ప్లాస్టిక్ బ్యాగ్లను సేకరించారు. ఈ సందర్భంగా బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్ మణి పల్వీసన్, డీజీఎం ఎస్ఎన్ కులకర్ణి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడు పాటుపడాలన్నారు.
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కేంద్రం ఇచ్చిన పిలుపుమేరకు ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిర్మూలిస్తామని బ్యాంకు సిబ్బంది ప్రతిజ్ఞచేశారు. చెరువులు, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద పేరుకుపోయిన చెత్త ఏరివేతకు శ్రమదాన్ను నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు.