బిజినెస్
బాండ్లకు పెట్టుబడుల పరిమితిని వేలం వేయనున్న బిఎస్ఇ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రూ.4615 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలుకు విదేశీ ఇనె్వస్టర్లకు పెట్టుబడి పరిమితులను బాంబే స్టాక్ ఎక్స్చేంజి బిఎస్ఇ సోమవారం వేలం వేయనుంది. సోమవారం మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 3.30- 5.30 గంటల మధ్య బిఎస్ఇకి చెందిన ‘ఇబిడ్ఎక్స్చేంజి’ ప్లాట్ఫామ్పై ఈ వేలం నిర్వహిస్తారు. ఈ డెట్ వేలం కోటాలతో విదేశీ ఇనె్వస్టర్లు తాము ఒనుగోలు చేసిన పరిమితి దాకా వీటిలో పెట్టుబడి పెట్టడానికి హక్కు లభిస్తుంది. ఈ నెల 1 దాకా ప్రభుత్వ బాండ్లలో మొత్తం పెట్టుబడులు 1,36, 954 కోట్లకు చేరుకున్నాయని, ఇది మొత్తం అనుమతించిన పరిమితి 1.44 లక్షల కోట్లలో 95.11 శాతం అని డిపాజిటరీల వద్ద అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి తెలుస్తోంది. కాగా, ఉపయోగించుకోకుండా మిగిలి ఉన్న బాండ్లను ఈ నెల 26న వేలం వేయాలని బిఎస్ఇ నిర్ణయించినట్లు ఎక్స్చేంజి ఒక సర్క్యులర్లో తెలియజేసింది.