బిజినెస్

స్పెక్ట్రమ్ వేలంలో తొలిరోజు రూ. 53,531 కోట్ల బిడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: మునుపెన్నడూ లేనివిధంగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో తొలి రోజైన శనివారం 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 700 మెగాహెట్జ్, 900 మెగాహెట్జ్ మినహా మిగతా అన్ని మెగాహెట్జ్ తరంగాల కోసం టెలికామ్ సంస్థలు పోటీపడ్డాయి. ఐదు రౌండ్ల బిడ్డింగ్ ముగిసే సరికి 53,531 కోట్ల రూపాయల విలువైన బిడ్లు వచ్చినట్లు అధికార వర్గాలు పిటిఐకి తెలిపాయి. సోమవారం వేలం మళ్లీ మొదలవనుండగా, శనివారం నాటి వేలంలో 2జి, 4జికి అనువైన 1,800 మెగాహెట్జ్‌కు అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత 2,100, 2,500, 2,300, 800 మెగాహెట్జ్‌ల కొనుగోలుకు టెలికామ్ సంస్థలు ఆసక్తి కనబరిచాయి.