'క్లాప్' కొట్టు గురూ!

తగ్గని క్రేజ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామల కెరీర్ 30 ఏళ్లు దాటాక మార్కెట్ మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టడం సహజమే. వయసు పెరుగుతున్న కొద్దీ క్రేజ్ కూడా పడిపోతుంటుంది. కానీ బ్యూటీ నయనతార క్రేజ్ మాత్రం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గకపోగా, పెరిగిపోతూనే వుంది. కోలీవుడ్‌లో అడుగుపెట్టడంతో మొదలైన కెరీర్ ఆరంభంలోనే అగ్ర హీరోలతో జతకట్టింది. వారి సరసన ఆటపాటలతో యువతను విశేషంగా అలరించింది. రాను రాను నాజుగ్గా మారి కుర్ర హీరోల సరసన చిందులేసింది. సూర్య, ధనుష్, శింబు వంటి హీరోల చిత్రాల్లో నటించి అటు తర్వాత కొత్త తరం నటులతో కూడా జతకట్టింది. వరుసగా ఆమె నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుకుంటుండంతో దర్శక, నిర్మాతలు నయనతార కాల్షీట్ల కోసం వేచిచూడక తప్పడంలేదు. తాజాగా ‘ఇరుముగన్’తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న నయన త్వరలో ‘కాష్మోరా’ చిత్రం ద్వారా మరోసారి అలరించడానికి సిద్ధమయింది. అయితే దక్షిణాదిలో అధికంగా పారితోషికం తీసుకునే కథానాయికలో జాబితాలో నయనతార కూడా ఉంది. టాలీవుడ్‌లో చేసే చిత్రాలకు దాదాపు నాలుగు కోట్లు తీసుకుంటన్నట్లు సమాచారం. అదే కోలీవుడ్‌లో అయితే ఆమె రెమ్యూనరేషన్ మూడు కోట్ల పైమాటేనట! తాజాగా తమిళంలో కూడా నాలుగు కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఓ నిర్మాత నయన కాల్షీట్ల కోసం వెళితే ఇలా పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడంతో దర్శకుడి కోరిక మేరకు సరేననడం చర్చనీయాంశం అయింది. ఈ విధంగా ఈ కేరళకుట్టి తన క్రేజ్‌ని ఏ మాత్రం తగ్గకుండా మార్కెట్‌ని పెంచుకుంటుండం గమనార్హం.

-సమీర్