గుంటూరు
లంకభూముల రైతులతో సిఆర్డిఏ డీసీ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తాడేపల్లి, డిసెంబర్ 18: రాజధాని పరిధిలోని ఉండవల్లి గ్రామ లంకభూముల విషయమై చర్చించటానికి ఉండవల్లి సిఆర్డిఏ డెప్యూటీ కలెక్టర్ కెఇ సాధన రైతులతో సమావేశమయ్యారు. శుక్రవారం స్థానిక సిఆర్డిఏ కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామ పరిధిలోని సుమారు 39 ఎకరాల లంకభూములను 26 మంది రైతులు ఇప్పటికే సాగు చేస్తున్నారు. సదరు రైతులకు అధికారుల ద్వారా సమాచారం అందించి ప్రాథమికంగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న రైతుల వారసులు పూర్తిగా హాజరుకాకపోవటంతో ప్రాథమిక అంశాలు చర్చించి, సమావేశాన్ని వచ్చే ఆదివారానికి వాయిదా వేశారు. ఈకార్యక్రమంలో లంకభూముల రైతులు, లంకభూముల సొసైటీ సభ్యులు, సిఆర్డిఏ తహశీల్దార్ శివశంకర్, డెప్యూటీ తహశీల్దార్ ఆజాద్, విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు.