గుంటూరు

మన్ననలందుకుంటున్న మోదీ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 10: దేశంలోని అన్నివర్గాల ప్రజల మన్ననలందుకున్న ఏకైక ప్రధాని నరేంద్రమోది అని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. బుధవారం స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మశీ కళాశాలలో భారతీయ జనతాపార్టీ అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం అర్బన్ జిల్లా అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ ప్రధాన మోదీ చేపడుతున్న అన్ని పథకాలకు దేశవ్యాప్తంగా ప్రజల ఆదరణ మెండుగా లభిస్తోందన్నారు. డీమానిటేషన్‌పై పలువర్గాలు చేసిన దుష్ప్రచారాలను ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు తిప్పికొట్టారన్నారు. పేదల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందన్నారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన జరగనున్న అమిత్‌షా సభకు నగరం నుండి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 500 మంది యువకులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మిశెట్టి ఆంజనేయులు మాట్లాడుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపుమేరకు నగరంలోని 469 పోలింగ్ బూత్‌కు ఈనెల 15వ తేదీలోగా నియామకాలు పూర్తిచేయనున్నామన్నారు. సమావేశంలో నర్సాపురం ఎంపి గోకరాజు గంగరాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి రంగరాజు, నాయకులు కెవి సుబ్బారావు, రవీంద్రరాజు, ఆలూరు కోటేశ్వరరావు, తోట రామకృష్ణ, తిరుపతిరావు, చితిరాల ఉమా, ఉయ్యాల ప్రసాద్, కస్తూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.