గుంటూరు
యార్డు అభివృద్ధికి కృషి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 July 2016
పెదనందిపాడు, జూలై 3: పెదనందిపాడు వ్యవసాయ ఉప మార్కెట్యార్డు కార్యాలయ భవనాలను ఆదివారం మార్కెటింగ్ ఎస్ఇ ఎం శ్రీనివాస్ సందర్శించారు. శిథిలమైన రైతు విశ్రాంతి భవనానికి త్వరలో 9 లక్షల రూపాయలతో మరమ్మతులు నిర్వహిస్తామన్నారు. జిల్లావ్యాప్తంగా 400 చెక్పోస్టులు ఉన్నాయని, వీటిలో ప్రాధాన్యతాక్రమంలో 200 చెక్పోస్ట్లను ఒక్కొక్కదానికి 2 లక్షల రూపాయలతో ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. యార్డు చైర్మన్ మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లింకురోడ్ల నిర్మాణానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో పొన్నూరు యార్డు పరిధిలో గల పలు లింకురోడ్లకు శంకుస్థాపన చేస్తామన్నారు. యార్డు డైరెక్టర్ కె చలమయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.