గుంటూరు
బాధితులకు అండగా ఉంటాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 3 July 2016
గుంటూరు, జూలై 3: జన్మభూమి నగర్ పంటకుంటలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్బాబు భరోసా ఇచ్చారు. ఆదివారం మృతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 62,500 రూపాయల చొప్పున 2,50,000 రూపాయల వ్యక్తిగత ఆర్థికసాయాన్ని అందించారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కూడా తగిన ఆర్థిక చేయూతను అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్ర భుత్వ స్థలాలతో పాటు ఐఎవై కింద ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ సంఘటన విచారకరమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, టిడిపి నాయకులు మన్నవ సుబ్బారావు, హర్షవర్ధన్ పాల్గొన్నారు.