గుంటూరు

లక్ష్మీవందితకు ప్రతిభా పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూలై 4: జెఎన్‌టియు కాకినాడ పరిధిలోని 253 ఇంజనీరింగ్ కళాశాలల్లో సిఎస్‌ఇ విభాగంలో శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మిట్టపల్లి లక్ష్మీవందిత రాష్ట్రప్రభుత్వ ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది. గత శనివారం జెఎన్‌టియు కాకినాడ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఎం లక్ష్మీవందితకు జెఎన్‌టియు కాకినాడ రిజిస్ట్రార్ జివిఆర్ ప్రసాదరాజు, రెక్టార్ బి ప్రభాకర్, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె పద్మరాజులు స్వర్ణపతకం, ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందించారు. లక్ష్మీవందితకు శ్రీ మిట్టపల్లి ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, కార్యదర్శి మిట్టపల్లి సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎవి భాస్కరరావు, ప్రొఫెసర్ పి బాల మురళీకృష్ణ, వివిధ విభాగాల అధిపతులు, ఎఒ సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు అభినందనలు తెలిపారు.