గుంటూరు

ప్రజల హృదయాల్లో వైఎస్ చెరగని ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 29: కష్టాల్లో ఉన్నవారికి కొండంత భరోసానిచ్చి ప్రజాసేవ, ఆప్యాయతలతో ప్రజల హృదయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్రవేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఐదురోజుల పాటు నిర్వహించే పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం బ్రాడీపేటలోని నిర్మలహృదయ్‌లో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో వృద్ధులు, మానసిక వికలాంగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ అమృతం లాంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్నివర్గాల వారికి అందరివాడిలా వైఎస్ కీర్తిపొందాడని శ్లాఘించారు. చనిపోయినా ప్రజల హృదయాల్లో జీవించి ఉంటారనటానికి ఉదాహరణ వైఎస్ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని నిరూపించిన నిత్య ప్రజాసేవకుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి సీతారామాంజనేయులు, సీనియర్ నాయకులు కిలారి రోశయ్య, షేక్ జానీ, గనిక జాన్సీరాణి, జగన్‌కోటి, పల్లపు శివ, విఠల్, రబ్బానీ, విక్టర్‌బాబు, వినోద్, వలీ, రవి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.