మెయిన్ ఫీచర్

తల్లిమనసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదోతరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.. సీబీఎస్‌ఈ పరీక్షల ఫలితాలు, స్టేట్‌బోర్డు పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఇందులో పదమూడు మంది విద్యార్థులకు 500 మార్కులకుగానూ 499 మార్కులు వచ్చాయి. అంటే 99.8 శాతం మార్కులు సాధించారు. స్టేట్‌బోర్డులో కూడా చాలామందికి 10 గ్రేడులే వచ్చాయి. తొంభై శాతానికి పైగా వచ్చిన పిల్లలకంటే వారి తల్లిదండ్రులు ఎక్కువగా ఆనందంగా ఉంటున్నారు. ఫలితాల రోజు పిల్లలకంటే తల్లిదండ్రులకే ఎక్కువ ఆత్రుత. పిల్లలు సాధించినందుకు వారి కంటే తల్లిదండ్రులకే ఎక్కువ గర్వం. ఇది ఏమాత్రం తప్పు కాదు.. అలాగని అందరూ తొంభై శాతాలే సాధించాలంటే ఎలా? యాభై శాతం, అరవై శాతం వచ్చిన విద్యార్థుల మాటేంటి? వారి తల్లిదండ్రులు ఎలా ఉంటారు? తమ చిన్నారుల భవిష్యత్తు గురించి దిగులుపడుతూ, పై చదువుల్లో వాళ్లు ఎలా నెగ్గుకువస్తారా? అని బాధపడుతూ ఉండి ఉంటారని చెప్పొచ్చు. కానీ అందరు తల్లిదండ్రులూ అలా ఉండరు.
‘బోడి చదువులు వేస్టు.. నీ బుర్రంతా భోంచేస్తు..
ఆడి చూడు క్రికెట్టూ.. టెండూల్కర్ అయ్యేటట్టు..’
అనుకుంటూ పిల్లల్లో టాలెంటును కనిపెట్టి దాన్ని పదును పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివారికి తమ పిల్లలు అరవై శాతంకానీ, యాభై శాతం కానీ.. ఎంత తెచ్చుకున్నా వారికి ఆనందమే.. పిల్లలు పాసైతే చాలు.. దిల్లీకి చెందిన వందనా సూఫియా అలాంటి అమ్మే.. చిన్నారుల ప్రతిభకు అంకెలు కొలమానం కాదని భావించే వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. వివరాల్లోకి వెళితే..
వందన కుమారుడు ఆమెర్ సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షల్లో అరవై శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అందుకు వందన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. కుమారుడి పట్ల తాను ఎందుకు గర్వపడుతున్నానో అందులో వివరించింది. ‘నా కుమారుడు అరవై శాతం మార్కులు సాధించడం పట్ల చాలా గర్వపడుతున్నా. అవి తొంభై శాతం కాకపోయినా, నా ఆనందంలో ఎలాంటి మార్పూ లేదు. కొన్ని సబ్జెక్టులు ఆమెర్‌కి బాగా కష్టంగా అనిపించేవి. దాదాపు ఆశలు వదులుకునే స్థితికి వచ్చాడు. అయినా చివరి నెలన్నర రోజుల్లో బాగా కష్టపడి చదివి పాసయ్యాడు. ఆమెర్, ఆ వయసున్న పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే.. చేపల్లాంటి మిమ్మల్ని చెట్లు ఎక్కమని అడుగుతున్నారు. కానీ విశాలమైన చదువు అనే సముద్రంలో మీదైన పెద్ద ప్రయాణాన్ని మీరు సాగించండి. ఆమెర్.. నీ మంచి మనసును, ఉత్సుకతను, తెలివిని, ముఖ్యంగా నీ హాస్య చతురతను అలాగే పదిలంగా ఉంచుకో’ అని వందన ఫేస్‌బుక్ పోస్టులో వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. కొన్నిగంటల్లోనే ఈ పోస్టును వేలమంది షేర్ చేశారు. వందనకు చాలామంది శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ స్పందించారు.
మార్కులతో సంతోషపెట్టాల్సిన బాధ్యత చిన్నారులది కాదు. కొందరు మాత్రం నెలన్నర కాకుండా, ఏడాదంతా కష్టపడితే ఆమెర్‌కు మంచి మార్కులు వచ్చి ఉండేవని వ్యాఖ్యానించారు. ఈ విషయంపైన కూడా వందన స్పందించింది. వెంటనే ఫేస్‌బుక్‌లో మరో పోస్టు పెట్టింది వందన. ‘మంచి మార్కులు రాలేదంటే విద్యార్థి ఏడాదంతా జులాయిగా తిరిగాడని అర్థం కాదు. ఒక్కో చిన్నారి ఒక్కోలా ఉంటాడు. మార్కులు రాకపోవడానికి అందరికీ ఒకటే కారణం ఉండదు. నా కొడుకు ఆమెర్‌ను తీసుకుంటే.. వారు రోజూ కష్టపడినా కూడా ఫలితాలు ఆశించినట్లు వచ్చేవి కాదు. అయితే.. నేనెప్పుడూ మిగతా చిన్నారులకూ, అతడికి పోలిక పెట్టేదాన్ని కాదు. ఆమెర్ కుంగిపోతుంటే నాకు దిగులుగా అనిపించేది. కానీ వాడు అక్కడితో ఆగిపోలేదు. సబ్జెక్టులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకుని చదివేవాడు’ అని పోస్టు పెట్టింది. తల్లిదండ్రులను మార్కులతో సంతోషపెట్టాల్సిన బాధ్యత చిన్నారులది కాదని, వారిపై ఎప్పుడూ చదువుకోమని ఒత్తిడి తేవడం సరికాదని వందన అభిప్రాయం. జీవితంలో విజయం సాధించడమంటే రూ. లక్షల్లో సంపాదించడం మాత్రమే కాదని, తన కుమారుడు అనుకున్నది సాధిస్తాడని వందన విశ్వాసం వ్యక్తం చేసింది. అదే తల్లిమనసు.