మెయిన్ ఫీచర్

బంధానికి నమ్మకమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. పెళ్లిల్లు స్వర్గంలో జరుగుతాయని అంటున్నారు . ఇవన్నీ పాతకాలపు మాటలు అని కొట్టిపారేస్తూ.. విడాకులకు సై అంటున్నారునేటి జనరేషన్. విడాకులు తీసుకోవటమనేది హక్కుగా మారిపోవటంతో దేశంలో విడిగా జీవించే జంటలు రాను రాను అధికమవుతున్నాయి. ఇంట్లో పెళ్లి సంబంధం కుదిరిందంటే అటు ఏడు తరాలను ఇటు ఏడుతరాలను విచారించి సంబంధాన్ని కలుపుకునేవారు. కాని నేడు పెద్దలు కుదిర్చిన పెళ్లయినా.. ప్రేమ పెళ్లయినా పదికాలాల పాటు పచ్చగా ఉండటం లేదు. వెయ్యి పెళ్లిళ్లు జరిగితే అందులో ఒక జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నదని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇంట్లో తమకు ఏమాత్రం సంతోషం అనేది కరువైతే వెంట నే విడాకులకు దరఖాస్తుచేసుకోవటం నేడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల జంటలు విద్యావంతులు కాకపోయినప్పటికీ చిన్నపాటి పొరపచ్చకే విడిగా జీవించటానికి ఇష్టపడుతున్నారు. ప్రేమా? ఇష్టంలేకపోవటమా? అనేది కారణం కాకపోయినప్పటికీ మూడు ముళ్ల బంధాన్ని మూడునాళ్ల ముచ్చటగా చేసుకుంటున్నారు.
వధువు అభిప్రాయాలకు విలువ లేకపోవటం..
ముచ్చటైన జంటగా పదికాలలపాటు సంసారం చేయాలంటే ఇరువురి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కాని మనదేశంలో పట్టణ ప్రాంతాలలో పరిస్థితి కాస్తంత మెరుగ్గా అనిపించినప్పటికీ ఇప్పటికీ 40శాతం మంది యువతులు తమ అభిప్రాయాలను చెప్పలేకపోతున్నారు. పెళ్లయిన తరువాత వివాహిత వైద్యుని వద్దకు వెళ్లాలంటే ఇంట్లో అనుమతి తీసుకుని వెళ్లాల్సిందే. దీంతో చిన్న చిన్న విషయాలకే జవాబు చెప్పటం కష్టమై కొన్ని అవాంఛనీయ పరిణామాలు వివాహబంధంలో చోటుచేసుకుంటున్నాయి. మహిళలకు ఆస్తి హక్కు లభించటం, విడాకులు తీసుకోవటం సులభతరం చేయటంతో చాలామంది చదువుకున్న అమ్మాయిలు పవిత్రమైన వివాహ బంధాన్ని ఆర్థిక బంధం గా భావిస్తూ విడాకులకు మొగ్గుచూపుతున్నారు. ఉన్నత మద్యతరగతి, ధనిక కుటుంబాల్లో అయితే ఈ బంధాలు ఆస్తుల తగాదాల వరకు వెళ్లి ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళుతున్నాయి. చదువుకుని ఉద్యోగం చేసే వివాహితులు ఆర్థికంగా పురుషుడి మీద ఆధార పడకుండా స్వతంత్రంగా జీవిస్తుండటంతో వ్యక్తిత్వాన్ని అవమానపరిచే సంఘటనలు ఎదురైనా ఏమాత్రం సహనం, సర్దుబాటు ధోరణి ప్రదర్శించకుండా విడాకులు తీసేసుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు రావటంతో భార్యభర్తలు ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా సహజీవన భావనను పదిలంగా కాపాడుకుం టూ, సర్దుబాటు వైఖరి అనుసరించాలి. కాని వారిద్దరి అభిరుచులు, ప్రాధాన్యత లు, ఆలోచనా విధానాలు వేరువేరుగా ఉండటం వల్ల సర్దుకోలేక ఘర్షణలు పడుతున్నారు. చివరకు ఆ జంట సర్దుకోలేక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.
విశ్వాసానికి విఘాతం..పిల్లలను వెన్నాడుతున్న ఒంటరితనం
నేటి జనరేషన్‌లో ఇగోకి అవకాశం ఇస్తున్నారు. అదే సమయంలో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి కొరవడి కొన్ని జంటలు ప్రేమ స్థానంలో పరస్పర ద్వేషానికి, అనుమానం, అవిశ్వాసానికి లోనవుతూ వారి కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి ఇవి హింసాత్మక సంఘటనలకు దారితీస్తాయి. అలాగే కొందరికి తెల్లారేపాటికి ధనవంతులైపోయి.. విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఆలోచన పాత బంధాల ను తెంపేస్తుంది. ఇలాంటి మానసికి ప్రవృత్తి అక్రమ సంబంధాలకు దారితీసి హత్యలకు సైతం వెనుకాడని పరిస్థితులకు దారితీస్తుం ది. దీనివల్ల ఆత్మీయానుబంధాలు ఏహ్యంగా మారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఎక్కువ నష్టపోయేది పిల్లలే. వారి జీవితాలను చిదిమేస్తున్నాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాల వల్ల మానసికంగా కుంగిపోయే పిల్లల కేసులు రెండు నెలలకు ఒకటి మాత్రమే తన వద్దకు కౌనె్సలింగ్ కోసం వచ్చేదని, కాని ఇపుడు ప్రతి వారం ఒక కేసు వస్తుందని ఢిల్లీకి చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణురాలు నాపూర్ వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ వేగంగా పెనవేసుకుంటున్న ప్రేమ, పెళ్లి, సహజీవనం లాంటి బంధాలు బలీయంగా, దృఢం గా మారకుండానే అంతే వేగంగా అదృశ్యమవ్వటానికి నమ్మకం, విశ్వాసం లేకపోవటమే ప్రధాన కారణం. ఏ జంటైనా విడిపోవాలనుకుంటే తమ పిల్లలకు భద్రత, భరోసా కల్పించిన తరువాతే ఆ ఆలోచన చేస్తే మంచిది.
మన దేశంలో ఏటా 1.36 మిలియన్ల మంది విడాకులు తీసుకుంటున్నారు. అంటే పెళ్లి చేసుకున్నవారిలో దాదాపు 0.24శాతం, మొత్తం జనాభాలో 0.11శాతం ఉంది.
విడిగా ఉండటానికి మహిళలే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో విడాకులు తీసుకునేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇందులో మిజోరం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ విడాకుల రేటు 4.08శాతం ఉంది. రెండో స్థానంలో నాగాలాండ్ ఉంది.
ఇక కులాంతర వివాహాలు దేశంలో 5శాతం మాత్రమే జరుగుతున్నాయి. దాదాపు 95శాతం వివాహాలు ఒకే కులస్థుల మధ్య జరుగుతున్నాయి. మిజోరంలో విడాకుల రేటుతో పాటు కులాంతర వివాహాలు సైతం ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే వివాహాలలో 87శాతం కులాంతర వివాహాలే.
పది మిలియన్ల జనాభాకన్నా అధికంగా ఉండే అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్ తరువాత గుజరాత్‌లో గరిష్ట సంఖ్యలో విడాకులు తీసుకునేవారి సంఖ్య ఉంది.
ఉత్తర భారతదేశంలో బీహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలలో విడాకుల రేటు తక్కువగా ఉంది.
అంతర్జాతీయంగా 71 దేశాలలో విడాకులు తీసుకునేవారిపై అధ్యయనం చేయగా జార్జియాలో 0.46శాతం మంది విడాకులు పొందుతున్నారు.