మంచి మాట

ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాంత చర్చలు, నీతి నిజాయతీలే ముఖ్యమంటూ చెప్పే కథలు, ఇతిహాసాలు, కావ్యాలు ఎన్నో ఉన్నాయ. అవన్నీ కూడా మనిషికి సేవాదృక్పథం, నీతి, ధైర్యం, మంచి నడవడి, త్యాగగుణం లాంటివి లక్షణాలు ఉండాలని చెబుతుంటాయ. ఓ కథనో, కావ్యాన్నో, ఇతిహాసాన్నో, చరిత్రనో చదివి మనిషి తన నడవడిని మార్చుకుంటాడు అంటే అది సహజమే నని పిస్తుంది. అందుకే పుస్తకాన్ని మించిన మిత్రుడు లేడని అంటారు. పుస్తకాలు అందులో ఉండే ఆదర్శాలను ఆకళింపు చేసుకొని తన జీవన మనుగడను సరిదిద్దుకుంటే ఆ మనుజుడు మహిలో కీర్తింపబడుతాడు. రామాయణంలోని సీత, కౌసల్య, కైక, సుమిత్ర, అనసూయ, లాంటి మహిళల గుణాలను నేటి స్ర్తి కూడా ఆదర్శంగా తీసుకొంటుంది అంటే అందులోని ఔచిత్యం తెలుస్తుంది.
ఒక్క సీతజీవితాన్ని తెలుసుకొంటే ఆమెలోని పవిత్రత, సహనశీలత్వం, ధృఢమైన నిర్ణయాత్మక శక్తి, అనుకొన్నదాన్ని నెరవేర్చే పట్టుదల, నేర్పు, ధైర్యం శీలం ఇట్లా ఎన్నో గుణాలు కనిపిస్తాయ. సీతామాత ఉన్నత సంస్కార జీవనానికి ఆమె జీవితం నిలువెత్తు నిదర్శనం... ఆమె అమ్మను ఎట్లా గౌరవించిందో అట్లానే కౌసల్యాదులను ఆదరించింది. పట్ట్భాషేకానికి అంతరాయం కలిగించిన చిన్నత్త కైకేయిని ఎన్నడూ నిందించలేదు. రాముడున్న చోటేఅయోధ్య అన్నది కాని ఆమె అయోధ్య లోని రాజభోగాలను కావాలని కోరుకోలేదు. రావణాసురుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, తాను సంపదలను వాంఛించదనే జవాబే చెప్పింది. ఇదే భారతీయ మహిళలోని గొప్ప ఆదర్శం. మానవత్వానికి, మానవ సంబంధాలకు ఇచ్చే స్థానం మహిళ మరే ఇతర భోగభాగ్యాలకు ఆమె ఇవ్వదు.
రామునిలో ఆర్తత్రాణ పరాయణతను గుర్తించిన సీత రామునితోనే జీవితం మనుకొన్నది. రామునితో వాదించి- ఒప్పించి, అతని వెంట తాను కూడా వనవాసానికి బయలుదేరింది. అరణ్యంలో ఆదరించిన అనసూయతో తన జన్మ వృత్తాంతాన్ని, వివాహ వృత్తాంతాన్ని మాత్రమే చెప్పింది తప్ప- తమ వనవాసానికి కారణభూతులైన వారిపై ద్వేషభావాన్నో కోపాన్నో ఆమె వ్యక్తపరచలేదు. తమను వెదుక్కుంటూ చిత్రకూట పర్వతానికి వచ్చిన భరతుడి ద్వారా మామగారి మరణవార్త విని రామలక్ష్మణులతోపాటు తానూ దుఃఖాన్ని అనుభవించింది.
లంకలో రావణుని వద్ద బందీఉండే సమయంలో రావణుని చూచి భయమొందక రావణునికే ఎన్నో హితవాక్యాలు చెప్పింది. పైగా మృత్యువు బారిన పడకుండా సుఖంగా ఉండాలనుకుంటే శ్రీరాముని శరణు వేడమనీ, చేతులారా వినాశనం కొని తెచ్చుకోవద్దంది. రాముని కీర్తి పట్ల ఆమెకుఎంత ప్రాముఖ్యమంటే తనను తక్షణమే లంక నుండి తీసికెళ్ళిపోతానని చెప్తున్న హనుమంతుడి కోరికను నిరాకరిస్తూ ఆమె, ‘‘మారుతీ! నేను నీ వెంట రాను. రావణుడిని చంపి, నన్ను తీసికెళ్ళిన కీర్తి నీ రామ ప్రభువుకే దక్కాలి.అట్లాకాక మరేవిధంగానైనా నేను రాముణ్ణి చేరితే అది ఆయన కీర్తిని ఆటంకం కలిగించినట్లే. అందుచేత వెంటనే వెళ్ళి రామ ప్రభువును తోడ్కొనిరా! శత్రువును ఎదిరించి నన్ను తీసుకెళ్లమని మన ప్రభువు నామాటగా చెప్పు ’’ అని ఆదేశించిందే తప్ప సరే నన్ను ఈ నరకంనుంచి తప్పించు అని అనలేదు. ఇక్కడ సీత మనోధృడత్వం తెలుస్తుంది.
అగ్నిప్రవేశం చేయమని రాముడుఅన్నా అది కేవలం లోక నింద రాకూడదనే ఆమెను అగ్ని ప్రవేశం చేయమంటున్నాడు అనుకొందే కాని రామునిపై శంక కాని రామునిపై కోపం కాని కలిగించుకోలేదు. అందుకే రాముని హృదయంలో సీత , సీత హృదయంలో రాముడు నివసిస్తూ లోకానికి సీతారాములు అనురూపులన్న ఖ్యాతి వహించారు. ఆదర్శ దాంపత్యం అంటే ఇట్లాగుండాలని తరతరాలకు ఆమె నడిచి చూపించింది. అందుకే ఏ జంటనైనా సీతారాముళ్లా ఉండాలని కోరుకుంటుంది. సీతలోని సౌశీల్యం ధృడత్వం పట్టుదల వినయ విధేయతలు, సహనం, క్షమ, దయ, కరుణ లాంటి వెన్నో గుణాలు నే టి మహిళందరూ నేర్చుకుని తీరవలసిందే.

- రాంప్రసాద్