విశాఖపట్నం

భావ కవితల నైవేద్యం ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మలో మమతల వనం నవనవలాడింది అక్షరామృత ఆస్వాదనలో మానవత్వపు విశ్వరూపం ఆవిష్కృతమైంది. సర్వులకు చిరునవ్వు కన్నీళ్లు ఒక్కటే యని ఆ భావ సమైక్య మైకమే నన్ను మనిషిని చేసింది. అంటూ బుద్ధికి జల్లెడ పట్టే జన హృదిని స్పృశించే ఏభైఏడు కవితల్ని ‘నైవేద్యంగా’ ఆవిష్కరించారు శ్రీమతి ఎస్ సుమత్రాదేవి. ఎంతో జీవితానుభవం గలిగిన చేయి తిరిగిన రచయిత్రిగా తన రెండవ కృతిగా మధుర మంజుల, భావరంజిత, కావ్యాన్నందించారు. ఆకాశవాణిలో కవి సమ్మేళనాలలో, ప్రముఖ పత్రికలలో వెలుగుచూసినవే. ఇందలి కవితలు, అవార్డులెన్నో అందించాయి. విదుషీమణి ఉపాధ్యాయురాలైనందున కవిత్వంలో స్పష్టత, క్లుప్తత, గుప్తతలతో పాటు మానవ మస్తిష్కానికి పదునుపెట్టేవిగా రూపొందించబడ్డాయి.
అక్షరంలో అద్భుతమైన సౌందర్యం ఉంది, అచంచల శక్తి ఉంది. అనంత విశ్వం ఉంది. జ్ఞానోద్దీపనను రగిలించే భావం అక్షరమైంది అని అక్షర వలువను వెలువరించి అక్షరంపై ఆత్మీయతను ప్రకటించడంలో అక్షరం, అక్షౌహిణీల సేనా బలంకన్నా మిన్నయన్న భావాన్ని ధ్వనింపజేశారు.
‘నయనం’ సున్నితత్వాన్ని ఇముడ్చుకున్న హృదయం, చైతన్యం కోల్పోతున్న మరో దేహానికి, కొత్త చిగురు వేస్తుందంటే, నిరభ్యంతరంగా బహూకరించండి, అప్పుడు కాశీ గంగలో అస్థికల్ని ముంచినంత ఫలం, అంటూ అంధులకు బంధువై ఆసరాయై, అభ్యర్థించడం, ఆహ్వానించదగింది.
నేడు చెట్టు, గట్టు, పువ్వు, పండు, నవ్వు, అన్నీ రసాయన పూతలే అదృశ్యపు సాలెగూడులో చిక్కుకున్న ప్రగతి మనది, ప్రవరాఖ్యుని కాలి లేపనంలా కరిగిపోతోంది. ఈ దిశలో మనిషిని మనిషిగా బతికించగల యుగకర్తలు వైతాళికులు కావాలి, రావాలి అనడం గమనించదగింది.
నిజం కాదా! కవితలో నేడు గాలికి కొట్టుకుపోయి, ఎగిరెగిరి వచ్చాయి ముదనష్టపు ఫ్యాషన్ల గుడ్డలు కురుచ బట్టలు అందాలట, నీటి తెరల్లాంటి పారదర్శక పొరలు వేసుకు తిరుగుతూ, అందాల్ని ఆరేస్తుంటే, కీచకులు పుట్టుకురావచ్చు, నీ దుస్తులే నీకు శ్రీరామరక్ష, అంటూ నేటి యువతులకు (యువతే-రచయిత్రి) సందేశం ఓ కనువిప్పు, ఓ మెరుపు పలుకు, ఓ హెచ్చరిక తునక, ఓ సున్నితపు సైగ.
నేడు ఉమ్మడి కుటుంబాల గూడు చెదరడంతో, మహిళ భద్రత, ఎడారిలో మంచుముద్ద, ప్రపంచీకరణ విపణిలో ‘స్ర్తి’ ఒక విలాస వస్తువు, అంతర్జాలంలో నగ్న ప్రదర్శనలు అంటూ వెర్రి పోకడలను నిరశిస్తూ ఖండిస్తారు.
ప్రేమంటే వెనె్నల మాధుర్యం, వసంతపు ఝంకారం, ఎదలో కదిలే వేణుగానం, గుప్పెడు గుండెలో ఒదిగిన ప్రణయ సాగరం అనడంలో వలపుల సడి, మాధుర్య జీవితాల ఒడి, పూపరిమళాల సందడి సమైక్యమై దర్శనమిస్తాయి.
చాలా కవితల్లో సున్నితపు సూచనల వాతలు. సోమరితనం తగదని యువతకి హెచ్చరిక, అత్యాచారాల నెదిరించే నినాదం, ఆక్రోశం, వాస్తవ జగత్తులో నడవాలనే ఆకాంక్ష, కాలుష్యపు కాట్లకు ఛీత్కారాలు, స్వచ్ఛ భారత్‌కి స్వాగతం, అంధకారంలో మగ్గిన బడుగులకు వెలుగుల గొడుగులు దురాగతాలనంతం చేయాలన్న గర్జన, అక్షరానికి అంజలి ఘటింపులతో వైవిధ్యభరిత వస్తు విశే్లషణలతో రమ్యంగా సాగిందీ కావ్యం. సుమితా దేవిని అభినందిద్దాం.
***
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు సెల్ : 9293327394