నిజామాబాద్

అభివృద్ధి పనులకు భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఏప్రిల్ 12: నగరంలోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంగళవారం అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా భూమిపూజ నిర్వహించారు. నగరంలోని 22వ డివిజన్ హైమద్‌పుర కాలనీలో 10లక్షల రూపాయల సాధారణ నిధులతో సిసి డ్రైనేజీ పనులకు, 37, 38వ డివిజన్లయిన ఆటోనగర్‌లో 15లక్షల సాధారణ నిధులతో సిసి డ్రైనేజీ, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 30వ డివిజన్ పరిధిలోని హజీం కాలనీలో 10లక్షలతో సిసి డ్రైనేజీ, పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
సతీష్‌నగర్‌లో 25లక్షల రూపాయలతో సిసిడ్రైనేజీ, రోడ్డు పనులకు భూమిపూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగరంలోని అన్ని డివిజన్లకు సిసిరోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు లక్షలాది రూపాయల నిధులను వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డిప్యూటీ మేయర్ ఫహీం, కమిషనర్ నాగేశ్వర్‌రావు, ఎఇలు రఫీక్, ముస్తాక్‌తో పాటు సిబ్బంది, కార్పొరేటర్లు పాల్గొన్నారు.