నిజామాబాద్

బీజేపీకి ఓటు.. అభివృద్ధికి బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, నవంబర్ 14: బీజేపీకి ఓటు వేసి అభివృద్దికి బాటలు వేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడైన , ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన బుధవారం తాడ్వాయి మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో అసెంబ్లీ స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలో నియంతపాలన కొనసాగించాడాని, ఆయన పాలన పట్ల ప్రజలు విసుగు చెంది ఉన్నారన్నారు. గత ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి స్వగ్రామంలో కూడా సర్పంఛ్, ఎంపీటీసీ స్థానాలను బీజేపీ గెలువడం పట్ల ఆ గ్రామంలో బీజేపీ ఉన్న బాలాన్ని నిరూపించిందన్నారు. తాను బాణాల బీంరెడ్డి చారిటెబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని ప్రజలు, రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తానని, ఆందుకోసం మూడు బోరు బండ్లను కూడా తాను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఆలాగే గల్ప్ వెళ్ళే వారికి ఎయిర్‌పోర్టు వరకు తన ట్రస్ట్ ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, తాపీ మేస్ర్తిలకు, గీతా కార్మికులకు ఉచితంగా 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తానన్నారు. ప్రతి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని, యువత కోసం స్వామి వివేకనంద విగ్రహాలను ఏర్పాటుచేస్తానన్నారు. వడ్ల, కమ్మరి, మంగళి, కుమ్మరి, ఆవుసుల, చాకలి తదితర చేత వృత్తుల వారికి దుకాణా దుకాణా సముదాయాలను ఏర్పాటు చేసుకున్న వారికి 11 వేల ఆర్థిక సహాయాన్ని తన ట్రస్టు ద్వారా అందిస్తామన్నారు. ఈకార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జీలు శైలేందర్‌నాథ్, గురునాథ్, రాష్ట్ర నాయకులు మర్రి రాంరెడ్డి, మండలాధ్యక్షుడు రమణారెడ్డి, బీజేపీ యువ మోర్చ మండలాధ్యక్షుడు వెంకట్‌రావు, నాయకులు రవీందర్‌రావు, సురేందర్‌రెడ్డి, కిషన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ దేవెందర్, తదితరులు పాల్గొన్నారు.