నిజామాబాద్

దొరల పాలనకు స్వస్తి పలకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమ్‌గల్, నవంబర్ 19: రాష్ట్రంలో కొనసాగుతున్న దొరల పాలనకు స్వస్తి పలకాలని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరవత్రి అనిల్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం భీమ్‌గల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా తరలి వచ్చిన అనిల్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న దొరల పాలన వల్ల పేద, బడుగు, బలహీనవర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలను దోచుకోవడమే ధ్యేయంగా పాలన కొనసాగించిన టీఆర్‌ఎస్‌కు ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పి, మహాకూటమికి పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేయించడం జరిగిందన్నారు. తనను మరోసారి గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఆయన వెంట ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్‌రెడ్డి, మండల కన్వీనర్ కనె్న సురేందర్, నాయకులు చంద్రునాయక్, ముస్సావీర్, జితేందర్, గంగయ్య, బొదిరె స్వామి, చిన్నగంగయ్య, నాగేందర్, వాక మహేష్, రహ్మాన్, షాదుల్లా, మల్లిక గంగాధర్ ఉన్నారు.