నిజామాబాద్

బాలుడిని కిడ్నాప్ చేసి.. గొంతునులిమి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, మే 19: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన బాలుడు విశాల్ కిడ్నాప్‌కు గురై మెట్‌పల్లి మండలం రామలచ్చక్కపేటలో గురువారం ప్రత్యక్షమయ్యాడు. ఇంటి పక్కన నివాసం ఉండే వేముల శంకర్ బాలుడిని కిడ్నాప్ చేయగా అతనిపై మెట్‌పల్లి పోలీసులు కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఓం ప్రకాష్, కవిత దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం ఆర్మూర్‌కు వలసవచ్చారు. ఆర్మూర్‌లో నివాసం ఉంటున్న ఓం ప్రకాష్ అనే వ్యక్తి బతుకుతెరువు నిమిత్తం దుబాయి వెళ్లడానికి ఇంటి పక్కన ఉన్న వేముల శంకర్ వద్ద నాలుగేళ్ల క్రితం 50 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వడంలో ఓం ప్రకాష్ జాప్యం చేస్తూ రావడంతో శంకర్ ఇటీవల ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఓం ప్రకాష్ భార్య కవిత 20 వేల రూపాయలను శంకర్‌కు ఇచ్చింది. అయినప్పటికీ మొత్తం డబ్బులు ఇవ్వాలని శంకర్ బెదిరించాడు. ఓం ప్రకాష్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ప్రకాష్ కుమారుడు విశాల్‌ను చంపుదామని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఓం ప్రకాష్ కుమారుడైన విశాల్‌ను కొండగట్టుకు వెళ్దామని చెప్పి బైక్‌పై వెంట తీసుకెళ్లాడు. మార్గంమధ్యలో రామలచ్చక్కపేట గ్రామ శివారు ప్రాంతం వరద కాలువ వద్ద కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి విశాల్‌కు తాగించాడు. స్పృహతప్పి పడిపోయిన విశాల్ గొంతు నులిమిన శంకర్ చనిపోయాడని భావించి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా గురువారం ఉదయం స్పృహలోకి వచ్చిన విశాల్ గ్రామంలోకి వచ్చాడు. వివరాలు చెప్పడంతో మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. పూర్తి వివరాలు సేకరించిన మెట్‌పల్లి పోలీసులు శంకర్‌పై కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శంకర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.