నిజామాబాద్

నియోజకవర్గంలో ఒక్క చెరువైనా నిర్మించావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూన్ 17: కరువుతో అల్లాడుతున్న కామారెడ్డి నియోజక వర్గంలో 10సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న నీవు ఒక్క చెరువును నిర్మించావా, ఒక్క చెరువు పునరుద్దరణకు స్వీకారం చుట్టావా అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు చురకలు అంటించారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లి వద్ద మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, హైద్రబాద్‌లో కూర్చొండి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎప్పుడు చేస్తున్న అభివృద్ధిని విమర్శించడమే మీ పని అంటూ షబ్బీర్‌పై విమర్శలు చేశారు. మంత్రిగా ఒక్క చెరువును కట్టించని నీవు మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు. భిక్కనూరు మార్కెట్ యార్డు చిన్నగా దృష్ట్యా జంగంపల్లిలో మార్కెట్ యార్డును నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా 3కోట్ల 30లక్షలతో నూతన గోదాంలు నిర్మించడం జరుగుతుందని, జంగంపల్లి చెరువులో 4తూంలతో పాటు కట్టుకాల్వలను నిర్మించడం జరుగుతుందన్నారు. ఎడ్లకట్ట వాగుపై ఫ్లీడర్ క్యానల్‌ను కట్టుకునేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 24గంటల పాటు నిరంతరంగా కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని, ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్న తమను ప్రజలను ఆదరిస్తుంటే ఇది గిట్టని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అధ్యక్షురాలు దొమ్మాట రాణి, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, పార్టీ మండల అధ్యక్షులు జుకంటి మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి అందె మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం కన్వీనర్ నర్సింహారెడ్డి, వైస్ ఎంపిపి రాజయ్య, డిసిసిబి డైరెక్టర్ చిన్నచంద్రారెడ్డి, కిష్ఠాగౌడ్, సొసైటి చైర్మన్లు తిర్మల్‌రెడ్డి, రవిందర్‌రెడ్డి, యం.నర్సింలు, నాయకులు వెంకమ్మగారి బస్వయ్య, సత్యనారాయణ, సంజీవరెడ్డి, రమేశ్, బల్వంత్‌రావు, కమలాకర్‌రావు పాల్గొన్నారు.