బిజినెస్

సంస్కరణల అజెండాపై నేడు జయంత్ సిన్హా సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్గొననున్న కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో మంగళవారం సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఇటీవల చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలపై చర్చించనున్నారు. సామాజిక భద్రత పథకాలపై వ్యయం, బ్యాంకింగ్ రంగ పునరుద్ధరణ, వ్యాపార నిర్వహణ సులభతరం కోసం తీసుకున్న సంస్కరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయ. ఈ సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శులతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రతన్ వటల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక సేవల కార్యదర్శి అంజులి చిబ్ దుగ్గల్, పలువురు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పాల్గొంటారు.