విజయవాడ
ఎండ ధాటికి ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 March 2016
పాయకాపురం, మార్చి 22: నగరంలో ఎండ ధాటికి వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన నగరంలోని నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాయకాపురం రాధనగర్లో నివాసముంటున్న జల్లి దుర్గారావు (35) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం. పనికి వెళ్లి మధ్యాహ్నం వచ్చిన దుర్గారావు మద్యం తాగేందుకు పాయకాపురం పెట్రోల్ బంక్ సెంటర్కు వచ్చాడు. అప్పటికే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో కళ్లు తిరిగి రోడ్డు మీదే పడిపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎండ తీవ్రతకు మృతి చెందాడు. మృతుని తల్లి జల్లి సామ్రాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.