విజయవాడ

కాపు ఉద్యమ కారులపై టిడిపి దురాగతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 16: నాడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేసి నేడు సిగ్గుతో తలొంచుకుంటున్నామని, ఇంటి నుంచి బయటకు సైతం రాలేకపోతున్నామంటూ రాష్ట్రంలోని కాపు సామాజిక నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కాపు రిజర్వేషన్ల అమలుపై ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరసన దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులలో దీక్షాపరులు, ఇతర కాపు సామాజిక నేతలపై అధికార తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు కాపు వర్గ నేతలే కాకుండా ఇతర సామాజిక ఉద్యమ నేతలు సైతం ఇమడలేకపోతున్నారని రాష్ట్ర శాసన మండలి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సి రామచంద్రయ్య పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ కాపు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా నిర్వహిస్తున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపిన రామచంద్రయ్య గురువారం నగరంలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కాపు రిజర్వేషన్ల సామాజిక ఉద్యమంపై నాటి నియంతలైన హిట్లర్, నాజీలు అవలంభించిన నియంతృత్వ పోకడలను అవలంభిస్తున్న తీరు అప్రజస్వామికన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, కాంగ్రెస్ పార్టీ కాపు రిజర్వేషన్ల సాధికారిక సంస్థ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరయ్య పాల్గొన్నారు.