విజయవాడ

హైజెనిక్ ఫిష్ మార్కెట్లకు రూ.కోటి మంజూరు చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, జూన్ 16: మత్స్య రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోందని, రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో హైజెనిక్ ఫిష్ మార్కెట్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే కోటి రూపాయలు మంజూరు చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం పోరంకిలో జరిగిన సభలో ఆయన ప్రకటిస్తుండగా హోం మంత్రి చినరాజప్ప తన నియోజకవర్గానికి ఒకటి మంజూరు చేయమని కోరడంతో అప్పటికప్పుడే కమిషనర్‌కు ప్రత్తిపాటి ఆదేశాలిచ్చారు. అలాగే చిలకలూరిపేట, పెనమలూరు, మండపేట నియోజకవర్గాలకు నేడు కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా ఫిష్ మార్కెట్‌లు మంజూరు చేస్తున్నానని మంత్రి ప్రకటించారు. మార్కెట్‌కు స్థలం, నీటి లభ్యత, విద్యుత్ సదుపాయాలుంటే ఫిష్ మార్కెట్‌లు మంజూరు చేస్తామని, శాసనసభ్యులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నూతన పద్ధతుల్లో ఆక్వా రైతులకు శిక్షణ, ఉత్పత్తి, మార్కెటింగ్ తదితర అంశాలపై జపాన్, చైనా దేశాల భాగస్వామ్యంతో మన రాష్ట్రం త్వరలో ఎంఓయు కుదుర్చుకోనుందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు.