విజయవాడ

వైకాపా మాయమాటలు నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 26: సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా స్ధానిక 42వ డివిజన్ బావాజీపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్ధించడంతోపాటు తన హయాంలో నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేన విధంగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన ఇంతటి అభివృద్ధి ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. అందుకే మళ్లీ సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను మరోసారి గెలిపించి మరలా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగచేయాలని విఙ్ఞప్తి చేశారు. ఐదేళ్ల పాటు కనపడిన వైసీపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి మోసపూరిత హామీ ఇస్తున్నారని ప్రజలు నమ్మవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావ, డివిజన్ అధ్యక్షులు బోను సుందరయ్య, కార్యదర్శి ప్రసాద్, పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్ధి బొండా ఉమా తనయుడు బొండా సిద్ధార్ధ ఒకటో డివిజన్‌లో సైకిల్ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత పెద్ద ఎత్తున సైకిళ్ళపై వీధి వీధిలో తిరుగుతూ తెలుగుదేశానికి ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యేగా బొండా ఉమాను మరోసారి బలపరచాలని యువతకు ఉద్యోగాలు పెద్ద ఎత్తున రావాలంటే తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ పిన్నమనేని శివరంజని, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాని, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బొండా ఉమా సతీమణి బొండా సుజాత 5వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్ధించారు. అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకే వేసి తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ధానిక కార్పొరేటర్ శేషారాణి, డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్, మహిళ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.