విజయవాడ

నగరంలో మహర్షి బృందం సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), మే 18: నగరంలో సూపర్‌స్టార్ ఘట్టమనేని మహేష్‌బాబు నటించిన మహర్షి చిత్ర బృందం శనివారం సందడి చేశారు. నగరంలోని సిద్దార్ధ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల మైదానంలో మహర్షి సినిమా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు చిత్ర బృందం తరలి రావడంతో వారిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నగరంలోని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో అభిమానులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. కళాశాల మైదానం ముందు సందడి చేశారు. మహేష్ జిందాబాద్.. జిందాబాద్ నినాదాలతో హోరేత్తించారు. అభిమాన హీరోని చూడటానికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు. కొందరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంట్రీ పాస్‌ల కోసం పడిగాపులు కాసినా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. వ్యవసాయం, రైతుల శ్రమని ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్ధే నటించగా దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఈ వేడుకల్లో దర్శకుడు వంశీపైడిపల్లి, నిర్మాతలు దిల్‌రాజు, పీవీపీ, అశ్వనీదత్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ఆదిశేషగిరిరావు, వైవీ చౌదరి, కథానాయకులు అల్లరి నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీరాజ్, మునిస్వామి, పలువురు సినిపరిశ్రమ ముఖ్యులు, చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ విజయం ముందే తెలుసు:మహేష్
సినిమా పెద్ద సూపర్ హిట్ అవుతుందని తనకు ముందే తెలుసని సూపర్‌స్టార్ మహేష్‌బాబు అన్నారు. కథ విన్నప్పుడే భారీ విజయం సాధిస్తుందని వూహించినట్లు పేర్కొన్నారు. తన మొదటి సినిమా రాజకుమారుడు తీసినప్పుడు తనకు ఎలా నడవాలో, నటించాలో నేర్పించిన దర్శకుడు రాఘవేంద్రరావును మామ అని సంభోదిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. రైతు పాత్రలో మునిస్వామి అద్భుతంగా నటించారన్నారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ జ్ఞాపికలు అందించారు.