విజయవాడ

మూడుముక్కలాట ఆడబోయి వైసీపీ బోర్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 27: రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం, మాకిక తిరుగులేదంటూ బీరాలు పలికి 8నెలలు కూడా గడవక ముందే సంతలో పశువుల్లా ఎమ్మెల్సీను కొంటున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైకాపా నేతలను విమర్శించారు. ఎమ్మెల్సీలను కొనడమే కాకుండా వారికి వైసీపీ కండువాలు కప్పి ఫొటోలకు పోజులు కూడా ఇస్తున్నారని సోమవారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. మూడు ముక్కలాట ఆడబోయి మండలిలో బొక్కబోర్లా పడుతున్నట్లు పసిగట్టి ఏ-2ను రంగంలోకి దింపారని ఆరోపించారు. ఏ-2 విజయసాయిరెడ్డి మండలి సాక్షిగా బేరసారాలు మొదలు పెట్టారన్నారు. మండలి గ్యాలరీలో కూర్చొని ఏ-2తో హార్స్ ట్రేడింగ్ చేయించారన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీలను కొనుక్కొని వైకాపా కండువా కప్పే దుస్థితికి జగన్ దిగజారిపోయారన్నారు. దీంతోనే జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థం అవుతుందన్నారు. 151 స్థానాలు గెలిచిన వ్యక్తి ఇద్దరు ఎమ్మెల్సీలను కొనే నీచ స్థాయికి దిగజార్చిన ఘనత మాత్రం మీకే దక్కుతుంది విజయసాయిరెడ్డీ.. అంటూ వైసీపీ ఎంపీని ట్యాగ్ చేస్తూ వెంకన్న కామెంట్ చేశారు.

మయసభలో దుర్యోధనుడిలా జగన్!
* మండలిలో ఘోరంగా భంగపడ్డ సీఎం * ట్విట్టర్‌లో టీడీపీ నేత వర్ల రామయ్య
విజయవాడ (సిటీ), జనవరి 27: మహాభారతంలో మయసభలో భంగపడిన దుర్యోధనుడిలా సీఎం జగన్ నిత్యం భంగపడుతూనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఏపీ శాసనమండలిలో కూడా సీఎం జగన్ భంగపడ్డారని సోమవారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఆనాడు మయసభను ధ్వంసం చేసి దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామంలో సర్వనాశనమైతే ఈనాడు మండలిని రద్దుచేసిన జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళితే ఆనాటి దుర్యోధనుడి గతి పట్టక తప్పదనే విషయం గుర్తించుకోవాలంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.